తెలంగాణ, సంగారెడ్డి. 27 మే (హి.స.)
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనం పై నుండి ప్రమాదవశాత్తు కిందపడిన మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలిమల ప్రాంతంలో ఓ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన రూప్ సింగ్ అనే మేస్త్రీ, అతని భార్య కార్మికురాలిగా అక్కడే పని చేస్తున్నారు. వారి మూడేళ్ల కొడుకు అక్కడే ఆడుకుంటుండగా, అప్రమత్తత లేకపోవడంతో మూడు అంతస్తుల భవనం పై నుండి కిందపడిపోయాడు.. తీవ్ర గాయాలవల్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు