ఉపాధ్యాయులు టెక్నాలజీనీ ఉపయోగించుకొని పాఠాలు బోధించాలి.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
తెలంగాణ, సంగారెడ్డి. 27 మే (హి.స.) ప్రభుత్వ ఉపాధ్యాయులు టెక్నాలజీనీ ఉపయోగించుకొని పాఠాలు బోధించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చింతా
సంగారెడ్డి ఎమ్మెల్యే


తెలంగాణ, సంగారెడ్డి. 27 మే (హి.స.)

ప్రభుత్వ ఉపాధ్యాయులు టెక్నాలజీనీ ఉపయోగించుకొని పాఠాలు బోధించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరిశీలించారు. ఉపాధ్యాయుల శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సెలవు రోజుల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు శిక్షణ శిబిరాలకు రావడం అభినందనీయన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉందని, విద్యా బోధనా ఫలితాలు అద్భుతమని కొనియాడారు. ఉపాధ్యాయుల కృషితో ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులుగా మారుతున్నారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande