ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది..ఎండీ వీసీ సజ్జనర్
హైదరాబాద్, 27 మే (హి.స.) హైదరాబాద్ నగరంలోని టీజీఎస్ఆర్టీసీ కళా భవన్లో రాష్ట్రస్థాయి ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డు సభ్యులతో ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు సమావేశమైంది. ఈ మీటింగ్ కు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధిక
సజ్జనార్


హైదరాబాద్, 27 మే (హి.స.) హైదరాబాద్ నగరంలోని

టీజీఎస్ఆర్టీసీ కళా భవన్లో రాష్ట్రస్థాయి ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డు సభ్యులతో ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు సమావేశమైంది. ఈ మీటింగ్ కు సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన వెల్పేర్ బోర్డు సభ్యుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్ధతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు. విధి నిర్వహణలో మరణించిన 2,350 మంది సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామన్నారు. మెడికల్ అన్ ఫిట్ అయిన మరో 537 మందికి ఉద్యోగాలు ఇచ్చామని వీసీ సజ్జనార్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande