అమరావతి, 28 మే (హి.స.): గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక పరిధిలోని రావిలంక వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో ప్రవీణ్(15), సూర్యతేజ(12) మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని కోనసీమ జిల్లా పి.గన్నవరం వాసులుగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి పౌల్కుమార్ (15) కోసం ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు గోదావరిలో స్నానాలకు వచ్చారని, వీరిలో ముగ్గురు కొట్టుకుపోతుండటంతో మిగిలిన ఇద్దరు భయంతో పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ