కడప, 28 మే (హి.స.)
అరవిందనగర్ (), తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని సీఎం చంద్రబాబుకు మంగళవారం అందజేశారు. మహానాడు వేదిక వద్ద సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీకి సేవ చేయడంతో పాటు సామాజిక సేవల్లో పాల్గొనాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ