హైదరాబాద్, 28 మే (హి.స.)
ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. బంజారాహిల్స్ లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకులాల విద్యార్థులకు బహుమతులను ప్రధానం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు.. తాను చదివింది అంతా ప్రభుత్వ స్కూల్ లోనే అని, అయితే నేడు ప్రైవేట్ స్కూల్ లో ఎక్కువ మంది చదువుతున్నారని వివరించారు.. దీనిపై అందరూ విశ్లేషించుకోవాలని కోరారు. ..
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..