అమరావతి, 28 మే (హి.స.)
పెనుమంట్ర, వైశాఖమాసం ముగియడంతో నత్తారామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామి దర్శనం మంగళవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. వైశాఖ మాసంలో నెల రోజుల పాటు భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. చివరిరోజు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. ఆలయ అర్చకులు రామేశ్వరపు రామలింగేశ్వరశర్మ, భాస్కర సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో స్వామిని కలువ, ఇతర పూలతో అలంకరించారు. అనంతరం ఆలయాన్ని నీటితో నింపే పని చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ