భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు.. డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ, ఖమ్మం. 28 మే (హి.స.) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున : ప్రతిష్ట కార్యక్రమంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి, స్వామివా
డిప్యూటీ సీఎం


తెలంగాణ, ఖమ్మం. 28 మే (హి.స.) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున : ప్రతిష్ట కార్యక్రమంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ప్రజాపాలన అందిస్తున్నందుకు భగవంతుడు రుతుపవనాలను ముందే తీసుకొచ్చారన్నారు. భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్రంలో ఇక సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు పాడిపంటలు పండుతాయన్నారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర నిధులను వెచ్చిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడానికి ప్రజా ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకొస్తున్నదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande