హైదరాబాద్, 28 మే (హి.స.)
ఫాంహౌస్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీశ్ రావు నేడు భేటీ అయ్యారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఇద్దరూ విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.కమిషన్ నోటీసుల నేపథ్యంలో వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీశ్ రావు విచారణకు హాజరుకానున్నారు. ఈ విచారణల్లో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్లు తెలిసింది.ఇప్పటికే న్యాయనిపుణులను సంప్రదించిన కేసీఆర్, హరీశ్ రావు.. చట్టపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..