హైదరాబాద్, 28 మే (హి.స.)
హఫీజ్ పేట్ డివిజన్ మైత్రి నగర్
పార్క్ స్థలంలో వేసిన మట్టి కుప్పలను, తాత్కాలిక నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. హఫీజ్ పేట్ డివిజన్ మైత్రి నగర్ ఫేస్ -1 కాలనీలో గల జీహెచ్ఎంసీ పార్క్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేయడంతో పాటు, అందులో తాత్కాలిక నిర్మాణాలను చేపట్టారు. పార్క్ స్థలాన్ని కాపాడాలంటూ కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది బుధవారం పార్క్ స్థలంలో వేసిన కుప్పలను తొలగించడంతో పాటు, తాత్కాలిక నిర్మాణాలను సైతం కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పార్క్ చుట్టూ హైడ్రా అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్