తెలంగాణ, జోగులాంబ గద్వాల. 28 మే (హి.స.)
సేకరించిన ధాన్యానికి వెంటనే
చెల్లింపులు జరగేలా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం గద్వాల మండల కేంద్రంలోని గుర్రం గడ్డ ద్వీప గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి, మిగిలి ఉన్న ధాన్యం 17 శాతం తేమ రాగానే కాంటా వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం కాంటా వేసిన బస్తాలను మిల్లులకు ఎప్పటికప్పుడు వేగవంతంగా మిల్లులకు తరలించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు