న్యూఢిల్లీ28 మే (హి.స.)
,రాజ్యసభ సభ్యుడిగా పాక వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం సత్యనారాయణ చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ ( ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్, ఏపీ మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానానికి పాక సత్యనారాయణ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా పాక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2028 వరకుసత్యనారాయణపదవిలో కొనసాగనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ