విశాఖపట్నం: 28 మే (హి.స.)నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి, గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (166.9 మి.మీ.)తో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య సగటు (87 మి.మీ.) కంటే 106% వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా; వాయవ్య భారతదేశంలో సాధారణంగా, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా సాధారణ సగటుకు మించిన వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మరోవైపు పసిఫిక్ ప్రాంతంలో ఎల్నినో తటస్థంగా ఉంది. ఈసారి రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం చూపబోదని ఐఎండీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ