విశాఖపట్నం, 28 మే (హి.స.)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల పదో తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆర్కే బీచ్రోడ్డులో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. పదో తేదీ ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్టులో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి 11.40 గంటలకు రోడ్ మార్గాన బయలుదేరి ఏయూ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కన్వెన్షన్ సెంటర్ నుంచి బయలుదేరి 1.10 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుని 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ వెళతారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ