హైదరాబాద్, 28 మే (హి.స.)
ఆర్టీసీ కార్మికుల సమస్యల పై
జేఏసీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఇబ్రహీంపట్నం బస్సు డిపో ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలైన ఆర్టీసీ బస్సు కిలోమీటర్లు పెంచడం, పని గంటలు పెంచడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే సెలవులు ఇవ్వకుండా మానసికంగా టార్చర్ పెడుతూ చిన్న చిన్న విషయాల పై అక్రమంగా ఛార్జిషీట్ లు ఇవ్వడం సబబు కాదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్