కాకినాడ 28 మే (హి.స.) : జిల్లాలో వచ్చేనెల ఒకటి నుంచి చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపణీకి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గత పాలనలో ఇంటింటికీ రేషన్ పేరుతో ఎండీయూ వాహనాలు తీసుకొచ్చారు. ఇంటి వద్దకు పంపకుండా కూడళ్లల్లో పెట్టి అందజేసేవారు. దానికోసం పడిగాపులు కాసేవారు. వేలమందికి అందేది కాదు. ఈ సమస్యను చక్కదిద్దేందుకు పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు రేషన్ దుకాణాలకు సరకుల తరలింపు, కచ్చితమైన తూకంతో పేదలకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. డీలర్ల వద్ద ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు చాలావరకు పాడైపోయాయి. వీటికి మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు వంటివి తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ