ఎన్టీఆర్ సేవలు తెలుగు జాతికి గర్వకారణం.. పీఏసీ చైర్మన్ గాంధీ
హైదరాబాద్, 28 మే (హి.స.) శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి
పీఏసీ చైర్మన్


హైదరాబాద్, 28 మే (హి.స.)

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో

దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా మహానటుడిగా, మహానాయకుడిగా వెలుగొందారని, ఆయన సేవలు తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు. ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించడంతోపాటు, పటేల్-పట్వారి వ్యవస్థను రద్దు చేసి, రెండు రూపాయలకే కిలో బియ్యం అందిస్తూ సామాన్య ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande