తెలంగాణ, నిజామాబాద్. 28 మే (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నగరంలోని దుబ్బా ప్రాంతానికి చెందిన సుంకరి నర్సయ్య (68) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా అటువైపుగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టింది. గమనించిన స్థానికలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
కాగా, దవాఖానలో నర్సయ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు