హైదరాబాద్: 28 మే (హి.స.) గచ్చిబౌలి బాహ్య వలయ రహదారి(ఓఆర్ఆర్) కూడలి ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. చౌరస్తా నుంచి అన్ని వైపులకు రయ్ రయ్ అంటూ దూసుకెళ్లొచ్చు. జూన్ 2, లేదా తర్వాతి రెండు, మూడు రోజుల్లో శిల్పా లేఅవుట్-2 పైవంతెనను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఇంజినీర్లు పైవంతెనను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కూడలిలో శిల్పాలేఅవుట్-1 పైవంతెన అందుబాటులోకి వచ్చింది. దానిపై వాహనదారులు ఐకియా కూడలి నుంచి నేరుగా రింగు రోడ్డుకు, రింగు రోడ్డుపై నుంచి బయోడైవర్సిటీ కూడలికి 2 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నారు. ఇప్పుడు శిల్పాలేఅవుట్-2 పైవంతెన అందుబాటులోకి వస్తే.. ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్ రోడ్డుకు, అక్కడి నుంచి ఓఆర్ఆర్కు రెండు నిమిషాల్లో చేరుకోగలరు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ