అమరావతి, 28 మే (హి.స.)
:వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ( అనుకున్న సమయానికంటే ముందుగానే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈరోజు (బుధవారం) మంగళగిరి పోలీస్స్టేషన్లో ) సజ్జల విచారణకు వచ్చారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో భార్గవ్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( మంత్రి నారా లోకేష్తో) పాటు జనసేన, టీడీపీ ముఖ్య నేతలపై కూడా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవ్ రెడ్డిపైఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లోకేసు నమోదు అయ్యింది.
ఈ కేసు నమోదు మేరకు సజ్జలకు మంగళగిరి రూరల్ పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు రాకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు సజ్జల. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా సుప్రీంలో పిటిషన్ వేశారు. అయితే సజ్జల వేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. దీంతో పోలీసులు మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా మంగళగిరి రూరల్ పోలీసులు సజ్జల భార్గవ్కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న సజ్జల ముందుగానే మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్కు వచ్చారు. మంగళగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరగాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ