అమరావతి, 28 మే (హి.స.)
కంబాలచెరువు(రాజమహేంద్రవరం), జీవితంలో ప్రతిఒక్కరూ యోగాను అంతర్భాగం చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మంగళవారం రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 1,300 మంది ఆశ్రమవాసులు, అధికారులు, సిబ్బంది మరో 200 మంది కలిసి యోగా సాధన చేశారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ యోగా సాధన నిరంతర ప్రక్రియన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ర్యాలీలు, పోటీలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారతదేశమేనన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జేసీ జి.చినరాముడు, జైలు పర్యవేక్షక అధికారి రాహుల్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. కేఎల్వీ శ్రీధర్రెడ్డి.. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆశ్రమవాసులతో యోగాసనాలు వేయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ