తెలంగాణ, సూర్యాపేట. 28 మే (హి.స.)
నకిలీ విత్తనాలు అమ్మితే విత్తన
డీలర్లు, దుకాణదారులపై కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్, ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని, రైతులకు వానాకాలం సీజనికి సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అలాగే రైతులు ఏ ఏ పత్తి విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాన్ని ఆరా తీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు