హైదరాబాద్, 29 మే (హి.స.)
నగరంలోని లోటస్ పాండ్ వద్ద ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోను రోడ్డు పక్కన నిలిపి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని టోలీచౌకికి చెందిన షాదిఫ్ (28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..