తెలంగాణ, 29 మే (హి.స.)
బిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఆమె అసంతృప్తి అనేది గత కొంతకాలంగా బయటపడుతోందని, ఇది ఇక బహిరంగంగానే మారిపోయిందని పేర్కొన్నారు. కవిత ఇటీవల పార్టీకి రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. BRS పార్టీలో తన పాత్రను పూర్తిగా విస్మరిస్తున్నారనే అభిప్రాయం ఆమెలో ఉందని, కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లే తనకూ ఇవ్వాలన్నది ఆమె ఆవేదన అని పేర్కొన్నారు.
ట్రబుల్షూటర్గా గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు తానే ట్రబుల్స్ లో చిక్కుకున్నారని, పార్టీ క్యాడర్ సందిగ్ధంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు