అమరావతి, 29 మే (హి.స.)
కోవూరు, బుచ్చి, పొదలకూరు, కావలి, కందుకూరు పట్టణం, వింజమూరు, న్యూస్: సినిమాహాళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నెల్లూరు ఆర్డీవో అనూష తెలిపారు. కోవూరులోని మైథిలి, శ్రీనివాస సినిమాహాళ్లను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ప్రేక్షకులకు నాణ్యమైన, శుభ్రమైన ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు టిక్కెట్లు అమ్మకాలు చేపట్టాలని, అధిక ధరలకు విక్రయించొద్దన్నారు. సినిమా హాళ్ల యజమానులు బాధ్యతగా మెలగాలన్నారు. పొదలకూరులోని సినిమా థియేటర్ను తనిఖీ చేశారు. ః సినిమా థియేటర్లలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సబ్కలెక్టరు శ్రీపూజ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రశాంతి, కోటేశ్వర, యువరాజ్ థియేటర్లను సబ్కలెక్టరు తనిఖీ చేశారు. ః కావలిలో ఆర్డీవో సన్నీవంశీకృష్ణ, తహసీల్దార్ శ్రావణ్కుమార్ పట్టణంలోని థియేటర్లను తనిఖీ చేశారు. వసతులపై క్షుణ్నంగా పరిశీలించారు. ః వింజమూరులోని శిరీష సినిమాహాల్ను తహసీల్దారు ఎస్ఎం హమీద్ తనిఖీ చేశారు. ః బుచ్చిలోని సినిమా థియేటర్లను తహసీˆల్దారు అంబటి వెంకటేశ్వర్లు పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ