హైదరాబాద్, 29 మే (హి.స.)
బీఆర్ఎస్ పార్టీని బీజేపీ లో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం వాటాల పంపకాల కోసం కల్వకుంట్ల కుటుంబంలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటూ యుద్ధం మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలకు కొత్త సినిమాను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
పార్టీ నడపడంతో పాటు పరిపాలనలో కేటీఆర్ అనర్హుడని సొంత చెల్లి కవితే చెబుతుందని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమి మిగలేదని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..