అమరావతి, 29 మే (హి.స.)
విజయవాడ: మద్యం కేసులో నిందితుల కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులను రెండ్రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్ప బాలాజీ, రాజ్ కెసిరెడ్డిలను కస్టడీకి ఇస్తూ తీర్పు వెల్లడించింది. నిందితులను సిట్ అధికారులు రేపు, ఎల్లుండి విచారించనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ