ప్రతి జోన్‌లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్.
హైదరాబాద్, 29 మే (హి.స.)హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల
ప్రతి జోన్‌లో ఒక్కో సైబర్ సెల్ పోలీస్ స్టేషన్.


హైదరాబాద్, 29 మే (హి.స.)హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786 % శాతం పెరిగాయి. 2016 లో 267 సైబర్ క్రైమ్ కేస్ లు ఉంటే 2024 లో 3111 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తర్వాత ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో 7 జోనల్ సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 7 సైబర్ సెల్ లో 61 సిబ్బంది నియమించారు. జోన్ డీసీపీ కిందనే సైబర్ సెల్స్ టాస్క్ ఫోర్స్ పని చేస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande