రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించ కూడదు.. బట్టి విక్రమార్క
తెలంగాణ, ఖమ్మం. 29 మే (హి.స.) రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని, నకిలీ విత్తనాలు విక్రయించేవారికి భయాన్ని కలిగించి, పుట్టగతులుండవన్న సందేశాన్ని పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ ల
భట్టి విక్రమార్క


తెలంగాణ, ఖమ్మం. 29 మే (హి.స.)

రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే

వినిపించకూడదని, నకిలీ విత్తనాలు విక్రయించేవారికి భయాన్ని కలిగించి, పుట్టగతులుండవన్న సందేశాన్ని పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..వానాకాలం సాగు కోసం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు కావాల్సినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే రికార్డు స్థాయిలో ఈ సీజన్లో 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande