అమరావతి, 29 మే (హి.స.)
చేనేత సహకార సంఘాలు పునరుజ్జీవం, కార్మికుల కుటుంబాలు జీవనోపాధి పొందేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేతన్న చేతికి మగ్గం మళ్లీ చేరువైంది. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన కృషి ఫలితంగా పెద్ద సంస్థలు ముందుకు వచ్చాయి. రూ.1.30 కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులను టాటా టన్నీరీయర్, ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థలు కొనుగోలు చేశాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.జగన్నాథపురం, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులుగుర్త వద్ద ఈ ఏడాది నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల్లో ఆయా సంస్థల ప్రతినిధులు విచ్చేసి ఉత్పత్తులను ఎంపిక చేసుకున్నారు. ఆదిత్య బిర్లా గ్రూపు పులుగుర్తను దత్తత తీసుకుని.. అక్కడ ఉన్న స్పిన్నింగ్ మిల్లుతో ఒప్పందం కొనసాగిస్తూ రూ.1.50 కోట్ల ముడిసరకును సేకరించింది. దీంతో మూడు జిల్లాల్లోని 55 చేనేత సహకార సంఘాల్లో 10.656 కార్మికుల జీవనోపాధికి ఊతం లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ