కడప, 29 మే (హి.స.)
కడప మహానాడు ) గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( ) అన్నారు. కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో చెప్పించారు ముఖ్యమంత్రి. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారుమ్రోగాలన్నారు. జనసంద్రంగా కడప నిండిపోయిందన్నారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ