అమరావతి, 29 మే (హి.స.):లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మూడు రోజులు.. అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరి కస్టడీ పిటిషన్పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆ రోజు సాయంత్రం తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కానీ ఈ సిట్ వేసిన పిటిషన్పై మే 29వ తేదీన తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ రోజు వీరిని సిట్ అధికారుల కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ