హైదరాబాద్, 29 మే (హి.స.)
మా నాన్నకు తాను లేఖ రాస్తే తప్పేంటి? అయినా మీకు నొప్పి ఏందిరాబయ్? అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరి కాదని హితవు పలికారు. హైదరాబాద్ లో నేడు ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతోన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పని చేస్తోన్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్పై పూర్తి విధేయతను ప్రకటించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..