తెలంగాణ, 29 మే (హి.స.)
మహబూబ్నగర్లో బాసర
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్ యూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం జుబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సత్కరించారు. ఈ మేరకు కాసేపు సీఎం ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు