అమరావతి, 29 మే (హి.స.)
విజయవాడ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు నెలరోజుల పాటు ‘యోగాంధ్ర’ ) పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘పోలీసు యోగాంధ్ర’ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీపీ రాజశేఖర్బాబు, ఇతర పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. పెద్ద ఎత్తున యువతీయువకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ