రహదారులు, రవాణాతోనే అభివృద్ధి : మంత్రి సీతక్క
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 29 మే (హి.స.) మారుమూల గ్రామాలు, పల్లెలు అభివృద్ధి చెందాలంటే రహదారులు, రవాణా సౌకర్యాల తోటే సాధ్యపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్డు 0/600 వద్ద 6.50 కోట్ల
మంత్రి సీతక్క


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 29 మే (హి.స.)

మారుమూల గ్రామాలు, పల్లెలు

అభివృద్ధి చెందాలంటే రహదారులు, రవాణా సౌకర్యాల తోటే సాధ్యపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత కొత్తగూడెం నుండి పెనుబల్లి రోడ్డు 0/600 వద్ద 6.50 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జి పనులకు ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరాలు, కొత్తగూడెం వంటి పట్టణాలు అభివృద్ధి చెందాయి. అంటే కేవలం రహదారులు రవాణా వ్యవస్థ వల్లనే అని, అందువల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మారుమూల ప్రాంతాలకు రహదారులు వేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande