కేసీఆర్ అప్పులు చేసి చిప్ప అప్పగించారు : మంత్రి జూపల్లి
తెలంగాణ, నిజామాబాద్. 29 మే (హి.స.) బాన్సువాడ ఎమ్మెల్యే నివాసంలో బీర్కూర్, నసురుల్లాబాద్ మండలలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్
మంత్రి జూపల్లి


తెలంగాణ, నిజామాబాద్. 29 మే (హి.స.)

బాన్సువాడ ఎమ్మెల్యే నివాసంలో

బీర్కూర్, నసురుల్లాబాద్ మండలలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్టాలను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడుతున్నారాని, అధికారం పోయి కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గతంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా కేసీఆర్ అప్పులు చేసి చిప్ప అప్పగించారని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande