ఖమ్మం, 29 మే (హి.స.)
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువులు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వారి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇటీవల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, తగిన మద్దతు ధర కల్పించడంలో కలెక్టర్లు చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. నకిలీ విత్తనాల మాఫియాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ మండలంలో విత్తనాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు