నల్గొండ, 29 మే (హి.స.)
గంజాయి విక్రయంతో పాటు
సేవించిన వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు. గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ లో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సుమారు 280 మంది పోలీసులతో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక శక్తులను తగ్గించడం కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాలనీలో ఉన్న ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 98 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్ ను గుర్తించినట్లు తెలిపారు. వీటితో పాటు అక్రమంగా నిలువ ఉంచిన 220 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు