అమరావతి, 29 మే (హి.స.)తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, (TDP) చంద్రబాబు ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, గత నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందన్నారు. 2024 ఎన్ని కల్లో ఎన్డీయే (NDA) కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తరవాత టీడీపీ ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తొలి మహానాడు సందర్బంగా 12వ సారి తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడుకు హృద యపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ను 'సైబరాబాద్'గా మార్చి, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు,
మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షిం చారు. 1999లో ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు మరియు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపచేశారు. ఆయన అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో, ఈ నూతన భాద్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలి..’ అని కోరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి