ఏదో ఒకరోజు POKను భారత్లో కలిపేస్తాం.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ, 29 మే (హి.స.) రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన బిజినెస్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన, PoK ప్రజలు భారత్ కుటుంబంలోని భాగమే అంటూ, త్వరలోనే వారు భారత్ లో కలుస్తారని ఆశాభావం వ్యక్
రాజ్నాథ్ సింగ్


న్యూఢిల్లీ, 29 మే (హి.స.)

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాక్

ఆక్రమిత కశ్మీర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన బిజినెస్ సమ్మిట్లో ప్రసంగించిన ఆయన, PoK ప్రజలు భారత్ కుటుంబంలోని భాగమే అంటూ, త్వరలోనే వారు భారత్ లో కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు మా సొంతవారు, మా కుటుంబ సభ్యులే అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు భౌగోళికంగా, రాజకీయంగా వేరుపడిపోయిన మా సోదరులు త్వరలోనే భారత్ లో ఏకమవుతారన్నారు.

PoK ప్రజలతో భారతదేశానికి గాఢమైన భావోద్వేగ బంధం ఉందని మంత్రి తెలిపారు. అక్కడి ప్రజల్లో ఎక్కువమంది భారత్ తో అనుబంధంగా ఉన్నారని, కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టినట్టు అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande