ఎమ్మెల్సీ కవిత తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల హాట్ కామెంట్స్
హైదరాబాద్, 29 మే (హి.స.) ఎమ్మెల్సీ కవిత తీరుపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అడ్డగోలుగా సంపాదిం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు


హైదరాబాద్, 29 మే (హి.స.) ఎమ్మెల్సీ కవిత తీరుపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాట్ కామెంట్స్ చేశారు.

గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరియు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అడ్డగోలుగా సంపాదించుకుని కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయితీ నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మీద విమర్శలు చేసే స్థాయి మీది కాదని కవితను విమర్శించారు. మీ తగాదాల మధ్యలోకి కాంగ్రెస్ ను లాగడం మానుకోండి.. మధ్యవర్తిని పెట్టుకొని తగాదాలు పరిష్కరించుకోండని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత చెబుతున్నారని వారు ఆరోపించారు. రెండు పార్టీలు ఒకటే అనేది గత ఎన్నికల్లో రుజువు అయ్యిందని, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాలు దిగజారిపోయి... ఆస్తి తగాదాలను కూడా రాజకీయం చేసుకుంటున్నారని విమర్శలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande