మద్యం మత్తులో ఇద్దరు గొడవ.. ఒకరు మృతి, పరారీలో మరొకరు
తెలంగాణ, మెదక్. 29 మే (హి.స.) మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడం తో ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తి పారిపోయిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని కాలాకల్ పారిశ్రామిక వాడలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క
మద్యం మత్తు


తెలంగాణ, మెదక్. 29 మే (హి.స.)

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు

గొడవపడం తో ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తి పారిపోయిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని కాలాకల్ పారిశ్రామిక వాడలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన నలీన్ కుమార్, మరో వ్యక్తి ఇద్దరు కిసాన్ ఇండస్ట్రీ ఎస్ ఎల్ ఎల్ పి లో పని చేస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరు మద్యం సేవిస్తూ గొడవపడగా నలీన్ అనే వ్యక్తి కింద పడి తల పగిలి మృతి చెందాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ నాగేందర్ గౌడ్, సీఐ రంగ కృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande