తెలంగాణ, నల్గొండ. 29 మే (హి.స.)
విధుల్లో అలసత్వంపై వహించిన అధికారులపై వేటుపడింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో పనిచేస్తున్న ఆరుగురు కార్యదర్శులపై బదిలీ వేటు పడింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గ్రామపంచాయతీ జిల్లా అధికారులు, నియోజకవర్గ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాలలో విధుల పట్ల అలసత్వం వహిస్తున్న కార్యదర్శులపై ఆరా తీశారు. పలువురు సదరు కార్యదర్శులపై ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విధుల పట్ల అలసత్వం వహించిన ఆరుగురు కార్యదర్శులను డీపీవో బదిలీ చేశారు. ఎంతటి వారైనా సక్రమంగా విధులు నిర్వహించకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు