అమరావతి, 29 మే (హి.స.)
విజయవాడ, మే 29: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. వంశీని రెండో సారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది నూజివీడు కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలంటూ హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టును కోరారు. మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఈ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారని వంశీ తరపు న్యాయవాది వాదించార
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ