తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. కిక్కిరిసిన కంపార్ట్‌మెంట్లు
తిరుమల, 29 మే (హి.స.)అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల కు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల
తిరుమల


తిరుమల, 29 మే (హి.స.)అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల కు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులతో నిండిపోయి ATGH వరకు క్యూ లైన్ కొనసాగుతోంది. బుధవారం స్వామి వారిని 83,261 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 33,445 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande