అమరావతి, 30 మే (హి.స.)
బసలదొడ్డి (పెద్దకడబూరు), ఆరేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఎర్త్ వైరు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన గురువారం పెద్దకడబూరు మండలంలోని బసలదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తెదేపా మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న మనవరాలు వేదవతి (6) ఎర్త్ తీగకు తగిలి మృతి చెందింది. విషయాన్ని కడపలో మహానాడులో ఉన్న ఈరన్నకు సమాచారం అందించగా స్వగ్రామానికి చేరుకుని విలపించారు. చిన్నారి తల్లిదండ్రులు జ్యోతి, మల్లికార్జున రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ