హైదరాబాద్, 30 మే (హి.స.) ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఆర్మీ మనోభావాలను గాయపర్చడమే కాకుండ.. దేశాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీపై ఉన్న అక్కసును ఆర్మీ మీద, దేశంపైన వెల్లగక్కుతున్నారన్నారు. పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడటం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నారని.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత పౌరులు అంతా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని పిలపునిచ్చారు. యుద్ధంలో ఒక్క విమానం కూడా కూలిపోలేదని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..