హైదరాబాద్, 30 మే (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ, టీ పీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అయితే ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. శుక్రవారం పార్టీ వ్యవహారాలపై చర్చించాలని హైకమాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ పర్యటన వాయిదా పడడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..