హైదరాబాద్, 30 మే (హి.స.)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఎం ఎం రత్నం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా టికెట్ల ధరలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు నిర్మాణ సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది. హరిహర వీరమల్లు సునిమా 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందించినట్లు నిర్మాత సీఎంకు వివరించారని ఆ పోస్ట్ పేర్కొంది. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా టికెట్ల ధరల పెంపుపై కూడా సీఎంతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఎంఎం రత్నం సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..